పవర్ స్టార్ ఫాన్స్ కి షాక్.. భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడింది. సంక్రాతి పండుగకు వస్తున్నామని చెప్పిన సినిమా యూనిట్, చివరకు తమ నిర్ణయం మార్చుకుంది. సంక్రాతి బరి నుంచి తప్పుకుంది. ప్రస్తుతం చిత్రం విడుదలను వాయిదా వేసుకుంది. ఫిబ్రవరి చివరి వారంలో వస్తున్నట్లు చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25వ తేదీన భీమ్లా నాయక్ విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫాన్స్ నిరాశ చెందారు. పవన్ కళ్యాణ్ తోపాటు రానా దగ్గుబాటి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా, భీమ్లా నాయక్ సినిమా విడుదల వాయిదా పడటానికి కొన్ని కారణాలున్నట్లు తెలుస్తున్నాయి.
2022 సంక్రాతి పండుగకు రావటానికి భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. పాన్-ఇండియా సినిమాలైన RRR మరియు రాధేశ్యామ్ భారీ విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. దీంతో సినిమా థియేటర్ల సమస్య రాకుండా నిర్మాతల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు చొరవ చూపారు. ఆయా సినిమాల నిర్మాతలతో మాట్లాడి, ఇతర సమస్యలపై కూడా చర్చించి చివరకు నిర్మాతల పరస్పర అంగీకారంతో భీమ్లా నాయక్ విడుదల వాయిదాకు నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో ఇలాంటి ఇబ్బందులు తప్పటం లేదు. కనుక, పవర్ స్టార్ అభిమానులు, తమ అభిమాన హీరో సినిమా కోసం ఫిబ్రవరి వరకు ఎదురుచూడక తప్పదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ