నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు, పాల్గొననున్న సీఎం కేసీఆర్

CM KCR To Participate in Christmas Celebrations Today held at LB Stadium,KCR To Participate in Christmas Celebrations ,KCR To Participate in Christmas Celebrations Today ,LB Stadium,Christmas Celebrations ,Christmas, Christmas celebrations in LB stadium,Christmas celebrations 2021,2021 Christmas celebrations ,Christmas celebrations in telangana,telangana Christmas celebrations ,2021 Christmas ,CM KCR,mango news

హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నేడు సాయంత్రం (డిసెంబర్ 21, మంగళవారం) తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కిస్మస్ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగే క్రిస్మస్‌ వేడుకల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, పలువురు నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ అధికారులతో కలిసి సోమవారం నాడు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి క్రైస్తవ పెద్దలనందరిని ఆహ్వానించినట్టు తెలిపారు. అలాగే హాజరైన అతిథులతో కలిసి సీఎం కేసీఆర్ విందు చేస్తారని తెలిపారు. అవార్డు ప్రదానోత్సవంతో పాటుగా, చిన్న పిల్లలకు కొత్త వస్త్రాలు పంపిణీ ఉంటుందని అన్నారు. మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో, ఇతర విభాగాల సమన్వయంతో జరిగే ఈ కిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ క్రిస్మస్‌ వేడుకల నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీస్టేడియం మార్గంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =