ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పదో విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్లమందికి పైగా రైతులకు రూ.20,000 కోట్లకుపైగా నిధులను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 1, శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా రూ.14 కోట్లకుపైగా ఈక్విటీ గ్రాంట్ను కూడా 351 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్పిఓలు) ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దీని వల్ల 1.24 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని ఎఫ్పిఓలతో సంభాషించడంతో పాటుగా జాతినుద్దేశించి కూడా ప్రసంగిస్తారని తెలిపారు. ప్రధాని మోదీతో పాటుగా ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పాల్గొననున్నారు.
ముందుగా దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద పదో విడత రూ.2000 సాయాన్ని జనవరి 1,2022న రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 1.6 లక్షల కోట్లకు పైగా నిధులను రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ