బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ముందుగా ఆయనకు మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్టెయిల్ థెరపీని ప్రారంభించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై బుధవారం మధ్యాహ్నం వుడ్లాండ్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
“ఆసుపత్రిలో చేరిన రెండవ రోజున, సౌరవ్ గంగూలీ ఆరోగ్యం స్థిరంగా ఉంది. జ్వర సంబంధంగా ఉన్నప్పటికీ, ఆక్సిజన్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అతను గత రాత్రి బాగా నిద్రపోయాడు, అలాగే అల్పాహారం మరియు భోజనం చేసాడు. డాక్టర్ సరోజ్ మోండల్, డాక్టర్ సప్తర్షి బసు మరియు డాక్టర్ సౌతిక్ పాండాలతో కూడిన మెడికల్ బోర్డు అతని ఆరోగ్య స్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ