బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు (జనవరి 4, మంగళవారం) తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. నగర శివారులోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రం(ఆర్వీకే)లో ఈ నెల 5,6,7 తేదీల్లో ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఒక రోజు ముందుగానే జనవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎయిర్పోర్టులో జేపీ నడ్డాకు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. నాలుగు రోజుల పాటుగా జేపీ నడ్డా హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటుగా వీహెచ్పీ సహా పలు సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ