దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ముందుజాగ్రత్త దృష్ట్యా హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ జనవరి 10, సోమవారం నుంచి ప్రికాషన్ డోస్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రికాషన్ డోస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలిరోజునే దేశంలో 9,84,676 మందికి కోవిడ్ ప్రికాషన్ డోస్ అందించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 5,19,604 మంది హెల్త్కేర్ వర్కర్స్, 2,01,205 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ మరియు 60 ఏళ్లు పైబడినవారు 2,63,867 మంది ఉన్నట్టు తెలిపారు.
ఇక జనవరి 11, మంగళవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 152.89 కోట్లు (1,52,89,70,294) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 92 లక్షల మందికి పైగా (92,07,700) వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. మరోవైపు దేశంలో 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకుకూడా జనవరి 3, 2022 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ