భారతీయ సినీమా పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా ద్రువీకరించారు. ‘స్వల్ప లక్షణాలున్నాయి. కానీ, వయసు రీత్యా.. ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ వయస్సు 92 సంవత్సరాలు. “భారతరత్న” అవార్డు అందుకున్న తొలి భారతీయ గాయనిగా ఆవిడ చరిత్ర సృష్టించారు. లతా మంగేష్కర్ కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ