జనవరి 26, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సందర్శనకు జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు మరియు సాధారణ సందర్శకులకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మొత్తం ఐదు రోజుల పాటుగా సందర్శనకు ఎర్రకోట మూసివేయబడుతుందని అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి బుధవారం నాడు ప్రకటన చేశారు. మరోవైపు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వేళలా బలగాలు అప్రమత్తంగా ఉంటాయని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
In view of Republic Day, the Red Fort shall remain closed for public and general visitors from January 22, 2022 to January 26, 2022, due to security reasons.#DelhiPolice#RepublicDay2022@CPDelhi @ASIGoI
— #DelhiPolice (@DelhiPolice) January 19, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF