ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ బదిలీలకు సంబంధించి శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజంపేట సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కేతన్ గార్గ్ను అనంతపురం జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జేసీగా ఉన్న నిశాంత్ కుమార్ ను గుంటూరు కార్పోరేషన్ కమిషనర్ గా నియమించారు. అలాగే శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా ఉన్న హిమాన్షు కౌశిక్ ను ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు. ఈ ఐఏఎస్ అధికారులు త్వరలోనే ఆ స్థానాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF