ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనికి తొలి అడుగుగా.. నేడు ఉద్యోగులు సీఎస్కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. 24న సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 25 నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్ కేంద్రాల్లోనూ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. పీఆర్సీ ఉత్తర్వుల రద్దు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్షమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండ్లతో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశంలో.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనుదారుల సంఘాల నాయకులు హాజరయ్యారు. సిఐటియూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అశుతోష్ మిశ్ర నివేదికను బహిర్గతం చేయాలని నాయకులు డిమాండు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి చేయనున్న ఉద్యోగుల సమ్మెకు.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతోపాటు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ సైతం సమ్మెలో పాల్గొననుంది. విజయవాడలో లారీ యాజమానుల సంఘం మద్దతు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రస్థాయి నుంచి గ్రామ, వార్డు సవాలయాల వరకు ఉద్యోగులందరూ ఉద్యమంలో పాల్గొనేలా ప్రణాళికలు చేశారు. రాష్ట్ర గ్రంధాలయ సంఘం సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఈ పోరాటులో వైద్యులు నర్సులు, పారామెడికల్ సిబంది పాల్గొంటారని తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔటీసోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పోరాటంలో పాల్గొంటారన్నారు. అయితే, పీఆర్సీ అంశంపై ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న నేపథ్యంలో నేడు కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేయనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF