హైదరాబాద్ నగరంలో.. నేడు 36 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ రూట్లో రైల్వే ట్రాక్స్ నిర్వహణ పనులను చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్స్ ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో.. ఈరోజు వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. హైదరాబాద్-లింగంపల్లి మధ్య 18 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. అలాగే ఫలక్నుమా-లింగంపల్లి మధ్య 16 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేసింది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నిర్వహణ పనుల కారణంగా ఈ ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF