తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది, దీంతో ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా 3603 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 23, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,815 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 2,707 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,98,649 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.08 శాతంగా, మరణాల రేటు 0.55 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,072 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,094 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1421, మేడ్చల్ మల్కాజ్గిరిలో 308, రంగారెడ్డిలో 262, హనుమకొండలో 150, కరీంనగర్ లో 98, మహబూబ్ నగర్ లో 96, సంగారెడ్డిలో 93, ఖమ్మంలో 92 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF