క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. అభిమానులు స్టేడియాల్లో మ్యాచ్లు చూసి ఎన్నాళ్లయిందో కదా.. కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయం కాకముందు ప్రేక్షకులతో స్టేడియాలు కిటకిటలాడేవి. అయితే, కరోనా వ్యాప్తి తర్వాత క్రికెట్ స్టేడియాలన్నీ బోసిపోయాయి. అభిమానుల కేరింతలు లేకుండా మ్యాచ్లు నిశ్శబ్దంగా, చప్పగా సాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఈ నెలలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20 సిరీస్తో అభిమానులకు ఆ కోరిక తీరనుంది. విండీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం సామర్థ్యంలో 75 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ఈడెన్ గార్డెన్స్ అధికారులు నిర్ణయించారు.
ఇండోర్, అవుట్డోర్ క్రీడలను 75 శాతం సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈడెన్ గార్డెన్స్ అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో టీ20 మ్యాచ్లకు దాదాపు 50 వేల మంది వరకు ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తారు. వెస్టిండీస్తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 సిరీస్ 16 నుంచి ప్రారంభం అవుతుంది. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని కరీబియన్ జట్టును ఎదుర్కొనేందుకు టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుని బయోబబుల్లోకి ప్రవేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ