ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం అయింది. రేపటి నుండి 14వ తేది వరకు ‘శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ధి’ వేడుకలు ఇక్కడ నిర్వహించనున్నారు. ‘సమతామూర్తి‘ పేరుతో శ్రీ రామానుజాచార్యుల వారి 216 అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా వస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న వస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఆయన భద్రత కోసం సుమారు 7వేల మంది పోలీసులు రక్షణ కల్పించనున్నారు. కాగా ప్రధాని నేరుగా ఢిల్లీ నుండి ముచ్చింతల్ ఆశ్రమంలోనే దిగనున్నారు.
కాగా, ఈ మహా ఉత్సవానికి టీఎస్ ఆర్టీసీ సైతం సన్నద్దం అయింది. సాధరణ ప్రజలు కూడా అక్కడికి వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ కూడా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుండి ముచ్చింతల్కు బస్సులను అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల బస్ స్టేషన్ల నుండి బస్సులు ప్రతి గంటకు బయలు దేరనున్నాయి. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోపాటు కాచిగూడ రైల్వే స్టేషన్ల నుండి ఉదయం ఆరు గంటలకు, ఏడు గంటలకు, ఎనిమిది గంటలకు బస్సులు బయలు దేరనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ