ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. కొద్దిసేపటిక్రితం ముచ్చింతల్లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా.. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని మోదీ సుమారు 3 గంటలపాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని.. యాగశాలలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి నారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొననున్నారు. సమతామూర్తి కేంద్ర విశిష్టతను ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి వివరించనున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ పెరుమాళ్ల దర్శనం, విష్వక్సేనుడి యాగంలో పాల్గొననున్నారు. తర్వాత రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న ‘సమతామూర్తి’ శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఫిబ్రవరి 2వ తేదిన ఆరంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14 వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం భక్తులను అద్భుతంగా అలరిస్తోంది. ఆశ్రమంలో ఏర్పాటుచేసిన 1035 కుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ యాగ కార్యక్రమం నభూతో.. అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద 216 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటం విశేషం.
ప్రత్యక్ష ప్రసారం కోసం ఇక్కడ చూడండి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ