ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గత నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను అందజేశారు. ఈ నేపథ్యంలో శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆహ్వానం మేరకు సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 9న విశాఖపట్నం వెళ్లనున్నారు. వార్షిక మహోత్సవాల్లో భాగంగా శారదా పీఠంలో నిర్వహించే రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో సీఎం పాల్గొననున్నారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అదే రోజున సీఎం వైఎస్ జగన్ విశాఖ నుంచి తిరిగి తాడేపల్లికి ప్రయాణం కానున్నట్టు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ