అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్-2022 కు వెన్ను గాయం కారణంగా టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ కోసం బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ భారత జట్టులోకి వచ్చాడని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. “ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్ టీ20 ప్రపంచ కప్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని ఎంపిక చేసింది. షమీ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు మరియు వార్మప్ మ్యాచ్లకు ముందు బ్రిస్బేన్లో జట్టుతో కలువనున్నాడు” అని బీసీసీఐ ప్రకటించింది.
ముందుగా టీ20 ప్రపంచకప్ కోసం అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపికచేసిన 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టులో సీనియర్ బౌలరైన మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. మహమ్మద్ షమీని స్టాండ్బై ప్లేయర్ గా ఎంపిక చేశారు. అయితే కీలకమైన ఈ ఐసీసీ టోర్నమెంట్ కు జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమవడంతో సీనియర్ అయిన షమీ వైపే సెలక్షన్ కమిటీ మొగ్గుచూపింది. అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ మరియు శార్దూల్ ఠాకూర్లు బ్యాకప్లుగా ఎంపికయ్యారని, త్వరలోనే వాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు బీసీసీఐ తెలిపింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY