కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 1,175 కరోనా కేసులు, 2 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,19,125 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 66,762 కి పెరిగింది.
ఇక కొత్తగా కరోనా నుంచి 1,612 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,41,033 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,511 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఎర్నాకులంలో 181, తిరువనంతపురంలో 166 మరియు కొట్టాయం జిల్లాలో 128 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో మొత్తం 27,093 కరోనా పరీక్షలను పరీక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ