ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద జనవరి-మార్చి 2022 త్రైమాసికానికి రూ.709 కోట్ల నిధులు విడుదల చేశారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమ చేశారు. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతి మూడు నెలలకొకసారి అనగా మొత్తం నాలుగు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటివరకు జగనన్న విద్యాదీవెన,జగనన్న వసతి పథకాల కింద సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రూ.10,994 కోట్లు ఖర్చు చేసింది.
ముందుగా తారకరామ స్టేడియానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ విద్యాదీవెన కార్యక్రమంకు సంబంధించి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, చదువు కోసం విద్యార్ధులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడి, మధ్యలోనే చదువు ఆపకుండా జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ నగదును నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలోనే వేస్తున్నామని, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా ఈ ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశామని, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టామన్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని మంచి పనులు చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంటే, ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతూ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ