ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. అలాగే పవర్ ప్రాజెక్టు, స్పిల్వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్ పనులను కూడా మంత్రి పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిని ఇంజనీర్లు మంత్రికి వివరించారు.
ఇక మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు వద్ద గల సమావేశ మందిరంలో పనులు పురోగతి, ఇతర అంశాలపై సంబంధిత అధికారులు, ఇంజనీర్లుతో మంత్రి అంబటి రాంబాబు సమీక్ష నిర్వహించారు. కాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ