దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఏలూరు కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై పిటిషన్ వేశారు. పిటిషన్ లో ప్రభుత్వ పెద్దల పేర్లు చేర్చటం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, రాహుల్ దేవ్శర్మ, కృష్ణారావు, నలుగురు సీఐలు సహా మరో ముగ్గురు ఎస్ఐలపై ప్రైవేటు కేసు వేశారు. టీడీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలలో పాల్గొంటున్నానని ప్రభుత్వ పెద్దలు తనపై వ్యతిరేక భావంతో ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో తనపై 25 కేసులకు పైగా నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ