టాలీవుడ్ హీరోలు సామాజికసేవలో ముందుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వర్షాలు, వరదల వలన సాధారణ ప్రజానీకం చాలా ఇబ్బందులు పడింది. వారిని ఆదుకోవటానికి పలువురు టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో విపత్తులు సంభవించినప్పుడు ప్రభాస్ స్పందించి పెద్దమొత్తంలో విరాళాలు అందజేశారు. ఎప్పుడూ సామాజికసేవలో ముందుండే ప్రభాస్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ