శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ అందించింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు (జూలై 7, గురువారం) ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనునట్టు మంగళవారం నాడు టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. అలాగే జూలై 12, 15, 17 తేదీలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు (జూలై 6, బుధవారం) ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.
మరోవైపు తిరుమలలో వేసవి ప్రారంభం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన అనంతరం ఏప్రిల్ నుంచి సర్వదర్శనం భక్తులను కూడా అనుమతిస్తుండడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో రూ.509.76 కోట్ల హుండీ కానుకలు లభించాయి. మార్చి నెలలో రూ.128 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.127.5 కోట్లు, మే నెలలో రూ.130.5 కోట్లు, జూన్ నెలలో రూ.123.76 కోట్లు హుండీ కానుకలు వచ్చినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY