ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి దివంగత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులు సీఎం జగన్ కడప షెడ్యూల్ను ప్రకటించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ రెండురోజులూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం జగన్ కడప షెడ్యూల్..
- 7వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
- గన్నవరం నుంచి 9.30కి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.55కు పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు.
- 10.55కు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు పులివెందులలోని ఆర్అండ్బి అతిథి గృహానికి చేరుకొని 11.05 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ప్రజలు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు.
- 1.05కు ఆర్అండ్బి గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి 1.15కు పులివెందులలోని ఏపీకార్ల్ చేరుకొని 1.35కు ఏపీకార్ల్ ప్రధాన భవనానికి చేరుకుని న్యూటెక్ బయోసైన్సెస్కు శంకుస్థాపన చేస్తారు.
- 2.35కు ఏపీకార్ల్ నుంచి బయలుదేరి 2.45కు బాకరాపురం హెలీప్యాడ్కు చేరుకొని 3.05కు వేంపల్లి హెలీప్యాడ్కు చేరుకుంటారు.
- 3.20కి రోడ్డు మార్గాన బయలుదేరి 3.30కి డా. వైఎస్సార్ స్మారక పార్కుకు చేరుకొని పార్కును ప్రారంభిస్తారు.
- 3.50కి అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
- 4.50కి వేంపల్లి జెడ్పీ స్కూల్ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు వేంపల్లి హెలీప్యాడ్ చేరుకొని హెలికాప్టర్లో 5.15కు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
- 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్ ఘాట్కు చేరుకొని దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు.
- 8.45కు వైఎస్సార్ ఘాట్ నుంచి బయలుదేరి హెలీకాప్టర్లో 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడినుంచి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
- అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ