దేశంలో మరోసారి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య లక్ష 19 వేలు (1,19,457 (0.27%)) దాటింది. గత 24 గంటల్లో 18,930 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,66,739 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 35 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,305 కి పెరిగింది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (4113), మహారాష్ట్ర (3142), తమిళనాడు (2743), పశ్చిమబెంగాల్ (2352), కర్ణాటక (1127), గుజరాత్ (665), ఢిల్లీ (600), తెలంగాణ (563), హర్యానా (415), ఒడిశా (401) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి.
ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.52 శాతంగానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. కొత్తగా 14,650 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,29,21,977 కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద జూలై 7, గురువారం ఉదయం 7 గంటల వరకు 198.33 కోట్లకుపైగా (1,98,33,18,772) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. ముందు రోజున 11,44,489 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY