శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు-2022 ప్రముఖ కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు డాక్టర్ వేణు సంకోజును వరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి, శ్రీ దాశరథి కృష్ణమాచార్యకు గుర్తింపుగా ఆయన జన్మదినం సందర్భంగా, తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలను గుర్తించి ప్రతి ఏడాది ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక సాహితీ అవార్డును ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ అవార్డు కింద రూ.1,01,116 (ఒక లక్ష వెయ్యి నూటా పదహార్లు) నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికను అందజేయనున్నారు. జూలై 22వ తేదీన దాశరథి జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలో డాక్టర్ వేణు సంకోజును సత్కరించి, అవార్డుతో పాటు రూ.1,01,116 నగదును అందజేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY