టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో గురువారం కోనసీమ జిల్లాతో పాటు, ప.గో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్పురం మండలాల్లో తిరిగి వరద బాధితులను కలవనున్నారు. ఇక రేపు శుక్రవారం యలమంచిలి, లక్ష్మీపురం, అబ్బిరాజుపాలెం, దొడ్డిబట్ల, గంగాధరపాలెం, పి.గన్నవరం, రాజోలులో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. చివరిగా పొన్నపల్లిలో చంద్రబాబు పర్యటన ముగియనుంది.
కాగా ఇటీవల గోదావరికి భారీగా వచ్చిన వరదల కారణంగా లంక గ్రామాలతో పాటు పలు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. కాగా గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా లంక గ్రామాలతో పాటు పలు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు గ్రామాలల్లో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ప్రభుత్వ సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఆయా గ్రామాలు జల దిగ్బంధంలో ఉండటం వాళ్ళ సహాయక చర్యలకు బాగా ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ