తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆయన ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో మరణించిన పాటిబండ్ల నరేంద్ర నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అన్నా క్యాంటీన్లను చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే వైసీపీ శ్రేణులు క్యాంటీన్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులను ఊరుకునేది లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని లోకేశ్ హెచ్చరించారు.
కుప్పం, తెనాలి, మంగళగిరి.. ఇలా అన్నిచోట్లా అన్నా క్యాంటీన్లను అడ్డుకుంతున్నారని, అయినా ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని, అన్ని జిల్లాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. పేదల కడుపు నింపటానికి దాతల సహకారంతో క్యాంటీన్లను నడిపితే వారికేంటి? వారు పెట్టకపోగా, మంచి కార్యక్రమాలు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తోందని, గతంలో ఎన్నడూ పోలీస్ స్టేషన్ వేళ్ళని తనపై 15కేసులు పెట్టారని, 7సార్లు పోలీస్స్టేషన్ తీసుకువెళ్లారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని తనకు ఇప్పుడు పోలీస్స్టేషన్ అత్తారిల్లులా తయారైందని నారా లోకేశ్ పరిహాసమాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ