ప్రధాని మోదీ అధ్యక్షతన పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం, ట్రస్టీగా రతన్ టాటా నియామకం

PM Modi Chairs Meeting of Board of Trustees of PM CARES Fund, Ratan Tata and 2 others Join as Trustees , PM Cares Fund , PM Cares Fund Board, PM Cares Fund Board Trustees, PM Modi , Narendra Modi, Mango News, Mango News Telugu, PM Narendra Modi Cares Fund, PM Modi Appointed Ratan Tata As Trustee, Ratan Tata , Ratan Tata Latest News And Updates, PM Modi News And Live Updates, Modi Indian Prime Minister

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం పీఎం కేర్స్ ఫండ్ యొక్క బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీఎం కేర్స్ ఫండ్ యొక్క ట్రస్టీలు అనగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు పీఎం కేర్స్ ఫండ్ కు కొత్తగా నామినేట్ చేయబడిన ట్రస్టీలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.టి. థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా 4345 మంది పిల్లలకు మద్దతిచ్చే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌తో సహా పీఎం కేర్స్ ఫండ్ సహాయంతో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశానికి కీలకమైన సమయంలో ఫండ్ పోషించిన పాత్రను ట్రస్టీలు అభినందించారు. పీఎం కేర్స్ ఫండ్‌కు మనస్పూర్తిగా సహకరించినందుకు దేశ ప్రజలను ప్రధాని మోదీ అభినందించారు. పీఎం కేర్స్ అత్యవసర మరియు బాధాకరమైన పరిస్థితులకు సమర్థవంతంగా ప్రతిస్పందిస్తుందని, అలాగే సహాయం ద్వారా మాత్రమే కాకుండా, ఉపశమన చర్యలు మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంపై కూడా.పెద్ద దృష్టిని కలిగి ఉందన్నారు. పీఎం కేర్స్ ఫండ్‌లో అంతర్భాగంగా మారినందుకు ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.

మరోవైపు పీఎం కేర్స్ ఫండ్‌కు సలహా మండలి ఏర్పాటుకై ప్రముఖ వ్యక్తులను నామినేట్ చేస్తూ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. భారత మాజీ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు మరియు ఇండికార్ప్స్ అండ్ పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈవో ఆనంద్ షా సలహా మండలికి ఎంపిక చేశారు. కొత్త ట్రస్టీలు మరియు సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ యొక్క పనితీరుకు విస్తృత దృక్పథాలను అందిస్తుందని ప్రధాని అన్నారు. ప్రజా జీవితంలో వారి అపార అనుభవం వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత శక్తిని అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY