శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రధాని నరేంద్రమోదీని ఫాలో అవుతాను, అందుకే నేను కూడా మాస్క్ ధరించడం లేదని రౌత్ పేర్కొన్నారు. సంజయ్ రౌత్ నాసిక్ పట్టణంలో ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. కానీ, ఆయన మాస్కు ధరించకుండా వేదికపై కూర్చున్నారు. అయితే, దీనిపై ఆయనను మీరు మాస్కు ఎందుకు ధరించ లేదని అక్కడున్న విలేకరులు ప్రశ్నించగా.. సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రధానమంత్రి మోదీ మాస్కులు ధరించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. కానీ, ఆయన మాత్రం మాస్క్ ధరించరు. మేమంతా ప్రధానిని అనుసరిస్తాం. అందుకనే నేను కూడా మాస్క్ ధరించలేదు’’ అని సంజయ్ రౌత్ చెప్పారు. ఒకవైపు మహారాష్ట్రలో కరోనా, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. మాస్క్ గురించి శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కరోనా కట్టడి కోసం జనవరి 7 వరకు ముంబైలో 144 సెక్షన్ విధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ