తిరుమలలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరగగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన సెప్టెంబరు 27, మంగళవారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం కార్యక్రమం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరివెళ్లారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటుగా సీఎం తిరుమలలో పర్యటించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన:
- మంగళవారం 5.20 గంటలకు తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి సీఎం చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
- ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు.
- రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకుంటారు.
- అనంతరం తిరుమల మాడవీధుల్లో జరిగే శ్రీవారి పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు.
ఈ రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. - ఇక సెప్టెంబర్ 28, బుధవారం ఉదయం 6.05 గంటలకు మరోసారి స్వామివారిని దర్శించుకుంటారు.
ఆతర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. - 7.10 గంటలకు టీటీడీ కోసం వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్ను సీఎం ప్రారంభిస్తారు.
- అనంతరం తిరుమల నుంచి సీఎం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమై, బుధవారం ఉదయం 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ఓర్వకల్ కు బయలుదేరుతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY