దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 5 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,272 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 29, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,83,360 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 27 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,611 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 40,750 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.72 శాతం:
దేశంలో ప్రస్తుతం 40,750 (0.09%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 4,474 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,13,999 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.72 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక సెప్టెంబర్ 28, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.44 (89,44,16,853) కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 3,23,293 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY