దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 501 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 16, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,66,676కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,535కి పెరిగింది. ఇక నవంబర్ 15న 1,50,503 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.33 శాతంగా నమోదైంది.
దేశంలో 7,561 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం:
దేశంలో ప్రస్తుతం 7,561 (0.02%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 856 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,28,580 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు కొంత ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE