తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రజానిధులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా పాజిటివ్ గా వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవని, అయితే వైద్యుల సలహా ప్రకారం ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నట్టు ఎంపీ పేర్కొన్నారు. ఇంటి నుంచే పనిని కొనసాగిస్తూ, దుబ్బాక ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 22 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001 కి చేరుకోగా, 2,07,326 మంది ఇప్పటికే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu