తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (సెప్టెంబర్ 30, శుక్రవారం) యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం స్వామివారికి బంగారం సమర్పించనున్నట్టు తెలుస్తుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అలాగే బాలాలయం ఆవరణలో కళా వేదిక నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇక యాదాద్రిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కూడా పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY