మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్లో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళల జట్టు ఈ మ్యాచ్ లోనూ అదే జోరుని కొనసాగించింది. శనివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 41 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ చెప్పుకోదగ్గ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. లంక బౌలర్లలో రణసింగ్ 3/32 సత్తా చాటింది. అనంతరం ఛేదనలో లంక 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో దయాళన్ హేమలత (3/15), పూజా వస్త్రాకర్ (2/12), దీప్తి శర్మ (2/15), రాధా యాదవ్ (1/15) లంక వెన్ను విరిచారు. భారత్ తన తదుపరి మ్యాచ్ అక్టోబర్ 7న పాకిస్థాన్తో ఆడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY