హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకోవాలని, ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మొత్తం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా:
- ప్రధాని నరేంద్ర మోదీ
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- రాజ్నాథ్ సింగ్
- అమిత్ షా
- నితిన్ గడ్కరీ
- బిఎల్ సంతోష్
- సీఎం జైరాం ఠాకూర్
- సురేష్ కశ్యప్
- ప్రేమ్ కుమార్ ధుమాల్
- శాంతా కుమార్
- స్మృతి ఇరానీ
- జ్యోతిరాధిత్య సింథియా
- భూపేంద్ర యాదవ్
- అనురాగ్ సింగ్ ఠాకూర్
- వీకే సింగ్
- హర్దీప్ సింగ్ పూరి
- సీఎం యోగి ఆదిత్యనాథ్
- సీఎం శివరాజ్ సింగ్ చౌహన్
- సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
- సీఎం పుష్కర్ సింగ్ ధామి
- సౌధన్ సింగ్
- అవినాష్ రాయ్ ఖన్నా
- మంగళ్ పాండే
- తేజస్వి సూర్య
- వానతి శ్రీనివాసన్
- దేవేంద్ర సింగ్ రానా
- సంజయ్ టాండన్
- కిషన్ కపూర్
- ఇందు గోస్వామి
- సికందర్ కుమార్
- పవన్ రానా
- మహేంద్ర సింగ్ ఠాకూర్
- రాజీవ్ బిందాల్
- రస్మింధర్ సూద్
- హార్ష్ మహాజన్
- పవన్ కాజల్
- సర్దార్ సందీప్ సింగ్
- మనోజ్ తివారి
- సంబిత్ పాత్రా
- దుశ్యంత్ కుమార్ గౌతమ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY