భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ-ఎంకే3-ఎం2గా పిలువబడుతున్న భారీ రాకెట్ ప్రయోగానికి 24 గంటల కౌంట్డౌన్ను ప్రారంభించింది. కాగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ జీఎస్ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీ-ఎం3) రాకెట్ను ప్రయోగించనున్నది. యూకేకి చెందిన ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వన్వెబ్’ రూపొందించిన 36 బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా రోదసిలోకి పంపనున్నది. ఇక దీనికి సంబంధించిన కౌంట్డౌన్ శుక్రవారం అర్ధరాత్రి 12.07 గంటలకు ప్రారంభమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
శనివారం ఉదయం సోమనాథ్ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ.. జీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగానే సాగుతుందని, ఈరోజు అర్ధరాత్రి 00.07 గంటలకు సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ను ప్రయోగిస్తామని తెలిపారు. యూకే దేశంతో 108 ఉపగ్రహాల ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 36 ఉపగ్రహాలతో జీఎస్ఎల్వీ మార్క్ – 3 ప్రయోగిస్తున్నామని, ఈ 36 ఉపగ్రహాలు పూర్తిగా కమ్యూనికేషన్స్కు సంబంధించినవేనని వెల్లడించారు. అలాగే 2023 మార్చిలోపు మరో నాలుగు ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపిన ఆయన ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగాలు ఉంటాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY