బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు సోము వీర్రాజు గురువారం ఓ వీడియో విడుదల చేశారు. “బుధవారం అనంతపురంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో జనసేనకు సంబంధించిన కొన్ని అంశాలను వక్రికరించడం జరిగింది. జనసేన దూరంగా ఉండాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్టుగా అందరూ ప్రోజెక్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. జనసేన విషయంలో ఎప్పుడూ జనసేనతో పొత్తు, జనంతో పొత్తు అనే శబ్దాన్నే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా నేను వినియోగించడం జరుగుతుంది. జనసేనతో పొత్తు కొనసాగుతుంది, వక్రీకరణ వార్తలను ఖండిస్తున్నాను” అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE