ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణకు సంబంధించి లేఖలో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్పై పంపాలనే కేంద్ర నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారు.
అయితే.. రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసుకు పంపడానికి ఇబ్బంది లేదని, కానీ ఎవర్ని పంపాలి అనే అంశం రాష్ట్రాలే నిర్ణయిస్తే బాగుంటుందని సీఎం జగన్ లేఖలో తెలిపారు. సాధారణంగా.. రాష్ట్రంలో పనిచేసే అధికారుల పనితీరు, సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తుంది. కనుక ఆ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందని ప్రధాని మోదీ కి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ