కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ హైదరాబాద్ నగరంలో రెండో రోజు కొనసాగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపడుతున్న భారత్ జోడో యాత్రలో ఇది 56వ రోజు కాగా, ప్రస్తుతం యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుండడంతో గత రెండురోజులుగా రాహుల్ గాంధీ హైదరాబాద్ నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్ తో పాటుగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు రాష్ట్ర సీనియర్ నేతలు, ప్రజలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారు. ఈరోజు యాత్రలో నటి, చిత్ర నిర్మాత పూజా భట్ కూడా కొద్దిసేపు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. అలాగే తెలంగాణలోని కొందరు మద్దతుదారులు మహంకాళి దేవిని పూజించేందుకు జరుపుకునే బోనాలు పండుగ వేషధారుణతో ఈ యాత్రలో పాల్గొగా, రాహుల్ గాంధీ వారితో ముచ్చటించి, ఫోటోలు దిగారు
ఈ రోజు (నవంబర్ 2, బుధవారం) ఉదయం 6 గంటలకు ఎంజీబీ బజాజ్ షోరూమ్, బాలానగర్ మెయిన్ రోడ్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. బాలానగర్ మెయిన్ రోడ్డు, ఫిరోజ్ గూడ, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ వరకు యాత్ర కొనసాగించారు. ఉదయం 10 గంటలకు మదీనగూడలోని హోటల్ కినారా గ్రాండ్ వద్ద పాదయాత్రకు రాహుల్ విరామం ఇచ్చారు. విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు బీహెఛ్ఈఎల్ బస్ స్టాండ్ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు హరి దోశ, ముత్తంగి సమీపంలో రాహుల్ గాంధీ నగరంలో రెండోరోజు పాదయాత్రను ముగించనున్నారు. బుధవారం రాత్రికి గణేష్ మందిర్ ఎదురుగా కౌలంపేట్, రుద్రారంలో రాహుల్ గాంధీ బస చేస్తారు. కాగా హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం రాహుల్ గాంధీ ఛార్మినార్ నుండి యాత్ర ప్రారంభించి, నెక్లెస్రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ముగించి కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన విషయం తెలిసిందే. నగరంలో రాహుల్ గాంధీ యాత్రకు భారీగా స్పందన రావడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో ఉత్సాహం నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE