రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై నేడు తెలంగాణ మంత్రుల కీలక సమీక్ష

Telangana Ministers Harish Rao, KTR, Errabelli to Held Video Conference on Covid-19 Management Today

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులుతో నేడు తెలంగాణ మంత్రుల బృందం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు.

అలాగే గురువారం ఉదయం 11:30 గంటల నుంచి జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా డీఎంహెఛ్ఓ, డీఐఓలతో కలిసి పాల్గొనాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరు, ఆసుపత్రుల్లో సదుపాయాలు, మందుల అందుబాటు, స్థానికంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు, అలాగే రాష్ట్రంలో అమల్లో ఉన్న కరోనా ఆంక్షల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో, తదుపరి కార్యాచరణపై కూడా చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =