తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా తోలి దశ ప్రజా సంగ్రామ యాత్రను అక్టోబర్ 2వ తేదీతో ముగించనున్నారు. ముందుగా ముగింపు సభను హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడం, ఎన్నికల కోడ్ దృష్ట్యా బండి సంజయ్ ప్రజా సంగామయాత్ర ముగింపు సభను హుస్నాబాద్ లో నిర్వహించనున్నట్టు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. అక్టోబరు 2వ తేదీన హుస్నాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇక 34వ రోజు పాదయాత్రలో భాగంగా శ్రీరాములపల్లి, నక్రకోమ్లా, పర్వేద, పందిళ్ల, పొట్లపల్లి వరకు వరకు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ