టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర బీజేపీ నేతలకు భయమెందుకు? అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. గురువారం ఆయన మరో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలులో తెలంగాణ బీజేపీ నాయకులు రోజుకోరకంగా మాట్లాడుతున్నారని, తొలుత ఇందులో తమకు సంబంధం లేదని చెప్పిన నేతలు ఇప్పుడు భయపడుతున్నారని అన్నారు. దీనిలో మధ్యవర్తులుగా వ్యవహరించిన నిందితులు తమకు తెలియదని చెప్పారని, అయితే వారిని పోలీసులు అరెస్టు చేశాక కేసు విచారణ కేంద్ర సంస్థలకు అప్పగించమని కోర్టులో పిటీషన్లు వేస్తున్నారని చెప్పారు.
బీజేపీ నాయకులకు తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేదా? అని ప్రశ్నించిన ఆయన ఈ కేసులో బీజేపీకి చెందినవారికి సంబంధం లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సిట్ను రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టారని, అయితే తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ముందు వారి ప్రయత్నాలు సాగలేదని అన్నారు. ఇక గవర్నర్ కూడా గురువారం మీడియాతో మాట్లాడుతూ తుషార్ పేరు ప్రస్తావించారని, అయితే సీఎం కేసీఆర్ చెప్పిన వ్యక్తి ఆయన కాదని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పింది కేరళలో రాహుల్ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయిన తుషార్ గురించి అని, అయితే గవర్నర్ మాత్రం తన వ్యక్తిగత ఏడీసీ తుషార్ ప్రస్తావన తెచ్చారని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE