తెలంగాణ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఎ) మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి నవంబర్ 25, శుక్రవారం నాడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, వెంకట్ స్వామి సహా పలువురు కీలక రాష్ట్ర నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్ కు రాజీనామా చేయడంపై మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ పనితీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని, తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనేత సోనియాగాంధీ మరియు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందని, అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని శశిధర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిందని, శ్రేణులను సరైన దిశలో నడిపించే నాయకత్వం లేదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్ఫష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE