పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్గా సీవీ ఆనంద బోస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని రాజ్భవన్లో కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, లెఫ్ట్ ఫ్రంట్ చైర్పర్సన్ బిమన్ బోస్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి హాజరు కాకపోవడం విశేషం. కాగా 1977 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద బోస్ ను కేంద్రం నవంబర్ 17న పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక గతంలో ఆయన కోల్కతాలోని జాతీయ మ్యూజియంలో అడ్మినిస్ట్రేటర్గా సేవలందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE