ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమిస్తున్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్, వివిధ కమిటీలకు ఛైర్మన్స్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మరియు కోఆర్డినేషన్ కమిటీ నియామకాలకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు దక్కగా, 34 మందితో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఏపీసీసీ ప్రెసిడెంట్: గిడుగు రుద్రరాజు
వర్కింగ్ ప్రెసిడెంట్స్ :
- మస్తాన్ వలీ
- జంగా గౌతమ్
- పద్మశ్రీ సుంకర
- పి.రాకేష్ రెడ్డి
- ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్: ఎం.ఎం.పల్లం రాజు
- ప్రచార కమిటీ ఛైర్మన్: జీవీ హర్ష కుమార్
- మీడియా అండ్ సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్: ఎన్.తులసి రెడ్డి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE