కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతోంది. అయితే యాత్ర ప్రారంభమైనప్పటి నుంచీ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రాహుల్ గాంధీ ఇటీవల ఒక అంశానికి సంబంధించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అదే.. రాహుల్ గాంధీ టీషర్ట్ ధరించడం. అవును, ఆయన టీషర్టుపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉత్తర భారతంలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది, దీనిని తట్టుకోలేక పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ కేవలం టీషర్ట్ మాత్రమే ధరించి రోడ్లపై యాత్ర చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆయన కేవలం టీషర్ట్ మాత్రమే ధరించడంపై స్పందించారు. దీని వెనుక గల అసలు కారణం చెప్పారు.
హర్యానాలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నేను యాత్ర ప్రారంభంలో కూడా టీ షర్ట్ ధరించాను. అప్పుడు కేరళలో ఎక్కువ వేడి ఉండటం వలన టీ షర్ట్ వేసుకున్నాను. కొన్ని రోజుల అనంతరం యాత్ర మధ్యప్రదేశ్ చేరుకోగానే, అక్కడ కొంచెం చలిగా అనిపించింది. అయితే ఒక ఉదయం నా దగ్గరకు ముగ్గురు పేద పిల్లలు వచ్చారు. వారు చిరిగిన బట్టలు ధరించి ఉన్నారు. వారు చలితో వణికిపోతుండటం గమనించాను. ఆ రోజే నిశ్చయించుకున్నాను.. నేను కూడా చలికి వణికేంతవరకూ కేవలం టీషర్ట్ మాత్రమే ధరించాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఇక జోడో యాత్రలో నా రూపం, నేను ధరించిన దుస్తులపై భారత జనతా పార్టీ అనవసర విమర్శిస్తోంది. దురదృష్టవశాత్తూ మీడియా కూడా దానిమీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. కానీ, నాతో పాటు ఈ యాత్రలో చాలా మంది పేదవాళ్లు చిరిగిన దుస్తులతో నడుస్తున్నారు. వాళ్లను ఎందుకు గుర్తించట్లేదు? వారందరి కంటే నేనేం ఎక్కువ కాదు’ అని రాహుల్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE