జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్ సోమవారం రాత్రి పరిశీలించారు. సభాస్థలి విషయంలో కొన్ని సూచనలను పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఇతర బాధ్యులకు ఇచ్చారు. మహిళకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అలాగే మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, లైటింగ్ సదుపాయం, సౌండ్ సిస్టం, భోజనాల ఏర్పాట్లు ఇతరత్రా అంశాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల “యువశక్తి” కార్యక్రమం పోస్టర్లను విడుదల కార్యక్రమం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన నింపిన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతోందని అన్నారు. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా పార్టీ యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.
జనసేన పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు:
జనసేన పార్టీలోకి నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని గాజువాక, నెలిమర్ల, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పవన్ కళ్యాణ్ ఆశయ సాధన మేరకు పని చేయాలని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో షేక్ ఫజులాల్ రెహమాన్, షేక్ ముజిబ్ రెహమాన్, అతుల్ రెహమాన్, ఎం.డి.షఫీ, షేక్ సలీం, కొల్లి కనక, జగదీష్, పి.శంకర్, బాడి పైడి రాజు, రాము, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE