ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటకలోని మైసూరు నుంచి బండిపురా వెళ్తుండగా కడకోల సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ప్రహ్లాద్ మోదీ తన భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి మెర్సిడెస్ బెంజ్ కారులో బండిపురాకు వెళ్తుండగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వారి వాహనం అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని వారు గాయపడ్డారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు ప్రహ్లాద్ వెంట ఆయన కాన్వాయ్ కూడా ప్రయాణిస్తోంది. ఇక ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ మనవడికి కాలు ఫ్రాక్చర్ కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు మైసూరులోని జేఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మైసూరు పోలీసు సూపరింటెండెంట్ సీమా లత్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిందని, ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, చికిత్స నిమిత్తం జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. కాగా ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY